Sudeep: గతకొన్నాళ్ళుగా ‘హిందీ భాషాధిపత్యం’ వ్యవహారమే పెద్ద దుమారమే రేగుతోంది. సరిగ్గా ఇది సౌత్ సినిమాలు RRR, KGF సినిమాలు రిలీజైన తరువాత మొదలయ్యింది. ఈ క్రమంలో రాజకీయంగా కూడా హిందీ భాష విషయంలో దక్షిణాది నుంచి తీవ్ర అభ్యంతరాలకు చెలరేగాయి. ఈ విషయంలో కన్నడ స్టార్ నటుడు సుదీప్, బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగన్ మధ్య జరిగిన ట్వీట్ల వర్షం గురించి అందరికీ తెలిసినదే. ఒకానొక దశలో ఇది ఎంతవరకు దారి తీస్తుందేమో అనే అనుమానం కలిగింది. ఇదిలా ఉంటే, తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హిందీ భాష ఆదిపత్య రగడపై పరోక్షంగా స్పందించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… దేశంలోని ప్రతి భాషను BJP సంప్రదాయాలకు నెలవుగానే చూస్తుందని, ప్రతీ భాషను గౌరవిస్తుందని అన్నారు. భాషా ప్రతిపాదికన వివాదాలు ప్రేరేపించే అంశాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని NDA ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా BJP కార్యకర్తలను ఉద్దేశించి మోదీ తాజాగా ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మాటలను స్వాగతిస్తున్నట్లు నటుడు కిచ్చా సుదీప్ తెలిపారు. సుదీప్ మాట్లాడుతూ.. “ప్రధాని మోడీ మాటలను గౌరవిస్తున్నా.. ప్రతీ ఒక్కరూ తమ భాషను గొప్పగా భావించాలి. ఇది అన్ని భాషలకు సంబంధించి విషయం. కేవలం కన్నడ గురించి మాత్రమే నేనేం మాట్లాడటంలేదు అని అన్నారు.
ఇంకా సుదీప్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీని కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు, వ్యాఖ్యలతో ఆయన్ని ఒక నేతగా చూడాల్సిన అవసరం ఎంతైనా వుంది.” అని కితాబిచ్చాడు సుదీప్. మొదట నా భాషకేదో గుర్తింపు రావాలనో, చర్చలు జరగాలనో, గొడవలు జరగాలనో నేను మాట్లాడలేదు. ఎలాంటి ఎజెండా లేకుండానే అలా జరిగిపోయింది. నా అభిప్రాయం మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు ప్రధాని నోట నుంచి ఇలాంటి ప్రకటన రావడం సంతోషంగా ఉంది అని ఓ మీడియా వేదికగా సుదీప్ చెప్పుకొచ్చాడు.