Sonu Sood: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా పడగా విప్పిన సంగతి తెలిసిందే. BF 7 అనే కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. చైనాలో హాస్పిటల్స్ మొత్తం నిండిపోయాయి. నిన్న ఒక్కరోజే మూడు కోట్లకు పైగా కొత్త కేసులు చైనాలో నమోదు కావటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ కూడా చేయడం జరిగింది. తప్పనిసరి మాస్క్ ప్రకటించటం మాత్రమే కాదు.. అన్ని విమానాశ్రయాలలో మళ్ళీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చైనా, హాంగ్ కాంగ్, కొరియా దేశాల నుండి వచ్చే ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూ ఉండటంతో… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా లాక్ డౌన్ సమయంలో దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయండి రీతిలో నటుడు సోనోసూద్ ఆపద్బాంధవుడుగా వివిధ రూపాలలో చాలామందిని ఆదుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ సోనూసూద్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “నా పాత నెంబర్ పనిచేస్తూనే ఉంది. కరోనా సాయం కోసం సంప్రదించవచ్చు. కరోనా సాయం కోసం నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను” అని ప్రకటించడం జరిగింది. దీంతో సోనూసూద్ ట్వీట్ సంచలనంగా మారింది.
2020లో దేశంలో కరోనా ఎంట్రీ ఇచ్చిన సమయంలో లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే. ఆ టైంలో సోనుసూద్ వలసదారులకు ప్రత్యేకమైన బస్సులు, ట్రైన్, విమానాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి ఆక్సిజన్ సిలిండర్ లు కూడా సరఫరా చేశారు. ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సోనోసూద్ తన సేవలు అందించడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతూ ఉండటంతో… నా పాత నెంబర్ ఇంకా పనిచేస్తుంది. కోవిడ్ సాయం కోసం కాల్ చేయొచ్చు అని పోస్ట్ పెట్టి తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటడానికి సోనూసూద్ రెడీ అయ్యాడు.