Kriti Sanon : ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లు ఒకే పాత్రలో కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. అయితే అలాంటి అవకాశాలు కొందరికి మాత్రమే వస్తాయి. మరికొందరు మాత్రం అలాంటి విభిన్నమైన పాత్రలో ఎక్కడైనా నటించడానికి ఒప్పుకుంటారు. ఈ కోవకు చెందినదే మహేష్ బాబు హీరోయిన్. మహేష్ బాబు సరసన నెంబర్ వన్ నేనొక్కడినే చిత్రంలో సందడి చేసిన కృతి సనన్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అనంతరం అక్కినేని నాగచైతన్య సరసన దోచెయ్ అనే సినిమాలో నటించింది. అనంతరం ఈమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్లి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
కృతిసనన్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటారు. అయితే కరోనా కారణం వల్ల లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎన్నో సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలయ్యే మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు విడుదలకు అనుమతి ఇచ్చినప్పటికీ కొన్ని సినిమాలు
ఓటీటీ ద్వారా విడుదలవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి.
ఓటీటీ విభిన్న పాత్రలో చేయాలని ఉందంటున్న కృతి:Kriti Sanon
తాజాగా ఈ ముద్దుగుమ్మ కృతిసనన్ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టును చేయాలనుకుంటున్నాను. అయితే అందులో ఇప్పటివరకు నటించని విభిన్న పాత్రలో నటించాలని ఉందంటూ ఆమె తన్ మనసులో మాటను ఎట్టకేలకు తెలియజేశారు.ఓటీటీ ద్వారా ఎన్నో సినిమాలను చూసి ఆనందపడ్డానని ఈ సందర్భంగా తాను కూడా ఓ ప్రాజెక్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా చేయాలని భావించినట్లు ఈ సందర్భంగా కృతి సనన్ తెలియజేశారు.బాక్సాపీస్ నంబరింగ్ గురించి ఏమాత్రం ఆలోచించే పని లేకుండా నువ్వు ఏం తీయాలనుకుంటున్నావో..అది రూపొందించే అవకాశం కేవలం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఉంటుందని సరైన అవకాశం వస్తే తప్పకుండా ఓటీటీలో విభిన్న పాత్రలో నటిస్తానని ఈ బ్యూటీ తెలియజేశారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!