Poorna: ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలెంట్ ఉన్నా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయిన పూర్ణ.. నటిగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు బుల్లి తెరపై `ఢీ`, `జబర్దస్త్` తదితర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇదిలా ఉంటే.. 33 ఏళ్ల పూర్ణ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. తనకు కాబోయే వరుడిని కూడా అందరికీ పరిచయం చేసింది. షానిద్ అసీఫ్ అలీ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. `కుటుంబసభ్యుల ఆశీర్వాదాలతో తన జీవితంలోని మరో భాగంలోకి అడుగుపెడుతున్నా` అంటూ కాబోయే వాడితో దిగిన పిక్స్ను షేర్ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పూర్ణ పోస్ట్ బట్టీ చూస్తుంటే.. ఇప్పటికే షానిద్ అసిఫ్ అలీ తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని స్పష్టంగా తెలుస్తోంది. త్వరలోనే ఆమెను పెళ్లి తేదీ అనౌన్స్మెంట్ రావడం ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు మరియు నెటిజన్లు పూర్ణ మరియు షానిద్ లకు విషెస్ తెలియజేస్తున్నారు.
షానిద్ అసీఫ్ అలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే.. కేరళకు చెందిన ఆయన యూఏఈ బేస్డ్ గా రాణిస్తున్న వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ మరియు సీఈఓ. జమా అల్మెహరి అనే కంపెనీని సైతం స్థాపించారు. అలాగే సినీ సెలబ్రిటీలకు ఆయన యూఏఈ వీసాలను అందిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. మొత్తానికి భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తినే పూర్ణ పెళ్లాడబోతోంది.
With the blessings of family stepping to my next part of life❤️💍 and now it’s official ❤️ pic.twitter.com/v7Qo04t3Ws
— Purnaa (@shamna_kkasim) June 1, 2022
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!