Rashmi Gautam: బుల్లితెరపై తన అందంతో, మాట తీరుతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రష్మీ క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పవచ్చు. తన అందచందాలతో, ముద్దు ముద్దు మాటలతో కుర్రకారుల మతి పోగొదుతుందని ఈ బ్యూటిఫుల్ యాంకర్. కేవలం బుల్లితెరపై యాంకర్ గా మాత్రమే కాకుండా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. అదేవిధంగా గుంటూరు టాకీస్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా మారిన రష్మి పలు సినిమాలలో కనిపించి సందడి చేశారు.
ప్రస్తుతం బుల్లితెర ప్రసారమయ్యే కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా పలు ఓపెనింగ్ కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమంలో సుధీర్, రష్మి జోడీ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి జోడి పై వేసే కామెంట్ లు ఎంతోమందిని ఆకట్టుకుంటాయి. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా ఈ యాంకరమ్మకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ, అభిమానులను సందడి చేస్తుంటారు.
పండుగ పూట మెరిసిన రష్మి:
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రష్మి అప్పుడప్పుడు ఫోటో షూట్ జరుపుకుంటూ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉగాది పండుగ సందర్భంగా రష్మి ఫోటో షూట్ జరుపుకుంది. ఉగాది పండుగ సందర్భంగా బ్లూ, పింక్ కలర్ కాంబినేషన్ లో లంగా వోని ధరించి ఎంతో అందంగా ముస్తాభయ్యారు. పండుగ పూట సాంప్రదాయమైన దుస్తులను ధరించి ఎంతో అందంగా ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకొని వైరల్ గా మారాయి. మరెందుకాలస్యం రష్మీ అందమైన ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!