Saiee Manjrekar: ఇటీవలె `గని`తో మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అందాల భామ సయీ మంజ్రేకర్.. ఇప్పుడు `మేజర్` సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించబోతోంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటించారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమైంది.
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ బయటకు వదులుతున్నారు. మరోవైపు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు ఓ నిర్మాతగా ఉండటం, ప్రతి అప్డేట్ ఆయన చేతుల మీదగానే బయటకు వస్తుండటంతో మేజర్పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అడివి శేష్, సయీ మంజ్రేకర్ లు కలిసి `ఆలీతో సరదాగా` అనే కార్యక్రమంలోనే పాల్గొని సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.
అలాగే సయీ మంజ్రేకర్ వచ్చీ రాని తెలుగుతో బాగా ఆకట్టుకుంది. ఇక ఈ క్రమంలోనే ఆలీ ఆమెను `మహేశ్ బాబును కలిశారా..?` అని అడగగా.. అందుకు ట్రైలర్ ఈవెంట్లో ఆయన్ను తొలి సారి కలిశాను అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో వెంటనే `నెక్ట్స్ సినిమాలో నన్ను హీరోయిన్గా పెట్టుకోవాలని మహేశ్ను అడగలేదా..?` అంటూ ఆలీ మరో ప్రశ్న వేశాడు. అందుకే సయీ మంజ్రేకర్.. `లేదు కానీ, ఆయన్ను చూడగానే మీ అందం వెనుకున్న సీక్రెట్ ఏంటని అడిగేశా` అంటూ ఓపెన్గానే చెప్పేసింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ కాస్త వైరల్గా మారాయి.