Actress Suhasini: ప్రస్తుతం సౌత్ సినిమాలు రాజ్యమేలుతున్నవేళ, సినీ వర్గాల్లో రకరకాల వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హిందీ భాష వివాదం హాట్టాపిక్గా మారింది. కన్నడ టాలెంటెడ్ హీరో కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెను సంచలనంగా మారాయి. ఈ కారణంగా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ల మధ్య ట్విటర్ వార్ నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ వివాదంపైన సౌత్, నార్త్ సినీ సెలెబ్రెటీలు స్పందిస్తూ, తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి సుహాసిని హిందీ భాష వివాదంపై స్పందిస్తూ, తమిళుల ఆగ్రహానికి గురయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Actress Suhasini: విషయం ఇదే
ఈ క్రమంలో ఆమె అన్న మాటలు అంత తప్పుగా ఏమి లేవు. కానీ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె స్పందిస్తూ… నటులు అన్న తర్వాత అన్ని భాషలను నేర్చుకుంటే బావుంటుందని అన్నారు. హిందీ భాష చాలా అందమైనది, అది కూడా నేర్చుకోవాలని ఆమె సూచించారు. హిందీ వాళ్లతో పని చేయాలంటే హిందీ నేర్చుకోవాలని కూడా ఆమె అన్నారు. అంతేకాకుండా, హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని కూడా సుహాసిని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె తన ఇంటిని ఉదహరించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కోపంతో ఊగిపోతున్న తమిళ తంబీలు
ఇంకా సుహాసిని మాట్లాడుతూ.. తమ ఇంట్లో పని చేసే వాళ్లలో కొంతమంది హిందీ కూడా మాట్లాడేవారు వున్నారని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగకుండా ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే మనకు ఎక్కడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సుహాసిని అభిప్రాయపడ్డారు. దాంతో సుహాసిని వ్యాఖ్యలపై తమిళ తంబీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలనిపిస్తే హిందీ సినిమాలే చేసుకుంటూ బాలీవుడ్లోనే ఉండాల్సిందంటూ సుహాసినిపై సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.