Adah Sharma: అదా శర్మ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `1920` అనే హీందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ.. `హార్ట్ అటాక్`తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం ఇలా పలు చిత్రాలు చేసింది.
కానీ, సరైన హిట్ మాత్రం పడలేదు. మరోవైపు కన్నడ, తమిళ్ భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న అదా శర్మ.. సక్సెస్ మాత్రం కాలేకపోయింది. సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన అతి ఉత్సాహంతో నెటిజన్లకు ఆగ్రహం తెప్పించే పని చేసి అడ్డంగా బుక్కైంది.
అసలేం జరిగిందంటే.. బప్పీలహరీ మాదిరిగా ఒంటి నిండా బంగారు నగలు ధరించి, వేళ్లకు ఉంగరాలు తొడుక్కుని ఫొటోలకు పోజిచ్చింది. అపై తన ఫొటోకు బప్పీలహరీ ఫొటోను జత చేసి ఫేస్బుక్లో చేసింది. అంతేకాదు, `ఎవరి ఫోటో బాగుంది?` అనే అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ కూడా వదిలింది.
దీంతో ఆమెను నెటిజన్లు ఏకేస్తున్నారు. గ్రేట్ సింగర్, లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్తో నీకు పోలికేంటి? అసుల నీకు బుర్ర ఉందా..? భౌతికంగా ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తితో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావా ? అంటూ నెటిజన్లు అదాను ట్రోల్ చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!