మేజర్ సందీప్ కృష్ణ ఉన్నిన్ జీవిత కథ ఆధారంగా జరకెక్కిన “మేజర్” సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. శశికిరణ్ దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముంబాయి 26/11 దాడుల నేపథ్యం ప్రధాన అంశంగా తీసుకొని దేశ రక్షణ కోసం సైనికుడు పడే పాటులు అతని కుటుంబం యొక్క భావోద్వేగాలు అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. మహేష్ బాబు ఈ సినిమాకి నిర్మాతగా ఉండటం మరి విశేషం. సినిమా చివరి అరగంటలో చాలామంది కంట్లో నుండి నీళ్లు వచ్చాయి. ఆఖరికి నిర్మాత మహేష్ కూడా సినిమా చూసిన ప్రారంభంలో కంటనీరు పెట్టుకున్నట్లు అడవి శేష్ తెలియజేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సినిమా యూనిట్ మొత్తాన్ని పిలిచి సత్కరించారు. ఇదే సమయంలో మేజర్ సందీప్ కుటుంబ సభ్యులకు కూడా కొంత సహాయం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలలో విడుదల కావడం జరిగింది.
ఓటిటిలో జులై మూడవ తారీకు విడుదలైన ఈ సినిమా అక్కడ నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా వీక్షించిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో చాలామంది మేజర్ సినిమాని తిలకించడం జరిగిందట. ముంబై ఉగ్రదాడులలో పాల్గొన్నది పాకిస్తాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన మేజర్ నీ నెట్ ఫ్లిక్స్ లో పాకిస్తాన్ వాళ్లు ఎక్కువ చూడటం విశేషం.