Adi Purush: “బాహుబలి 2” విజయంతో ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని క్రేజీ సంపాదించిన ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో “ఆది పురుష్” చేయటం సంచలనం సృష్టించింది. పైగా ఫస్ట్ టైం బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ఆధ్వర్యంలో ఈ సినిమా తెరకెక్కటంతో ఉత్తరాది ప్రేక్షకులు “ఆది పురుష్” పై ఎంతో ఆసక్తి కనబరిచారు. ఇంకా ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఈ క్రమంలో అక్టోబర్ 3వ తారీకు “ఆది పురుష్” టీజర్ రిలీజ్ కావడం జరిగింది. రాముని జన్మస్థలం అయోధ్యలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తీరా “ఆది పురుష్” టీజర్ రిలీజ్ అయిన తరువాత తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. త్రీడీలో .. వీడియో గేమ్స్ మాదిరిగా సినిమా ఉండటంతో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. వీడియో గేమ్స్ మాదిరిగా “ఆది పురుష్” టీజర్ ఉందని సోషల్ మీడియాలో నెటిజెన్ లు సెటైర్ లు వేస్తున్నారు. గ్రాఫిక్స్ మరి ఎటకారంగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడంతో దీన్ని డీల్ చెయ్యడం లో భాగంగా తాజాగా దర్శకుడు ఓమ్ రౌత్ స్పందించారు. “ఆది పురుష్” వెండి తెరను దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించాను. మొబైల్ స్క్రీన్ ల కోసం కాదు. అవకాశం ఉంటే అసలు యూట్యూబ్ లో రిలీజ్ చేసే వాడినే కాదు. కానీ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు.. మరో మార్గం లేదు. కానీ థియేటర్ లో చూశాక కచ్చితంగా అభిప్రాయం మారుతుంది అని జరుగుతున్న ట్రోలింగ్ పై దర్శకుడు ఓమ్ రౌత్ తనదైన శైలిలో.. రియాక్ట్ కావడం జరిగింది. “ఆది పురుష్” వచ్చే ఏడాది జనవరి 12వ తారీకు విడుదల కానుంది. మరి సినిమా ధియేటర్ లో ఏ రకంగా ఉంటుందో చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!