Adi Purush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “ఆది పురుష్” టీజర్ అక్టోబర్ మూడవ తారీకు విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్ర చేయడం జరిగింది. దీంతో ఈ సినిమాపై దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు మరింత ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ క్రమంలో వచ్చిన “ఆది పురుష్” టీజర్ కి భారీ ఎత్తున రెస్పాన్స్ రావడం జరిగింది. విడుదలైన అన్ని భాషలలో కలిపి 24 గంటల్లో ఇండియాలో నెంబర్ వన్ రికార్డు “ఆది పురుష్” టీజర్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి..101 మిలియన్ వ్యూస్ తో “ఆది పురుష్” టీజర్ ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకుంది.
అంతేకాదు యూట్యూబ్ లో కూడా నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. 3d ఫార్మేట్ లో విడుదలైన “ఆది పురుష్” టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఇదే అనుభూతి సినిమా ధియేటర్ లో మరింతగా ఉంటుందని నిర్మాతలు తెలియజేస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తారీకు “ఆది పురుష్” రిలీజ్ కానుంది. మరోపక్క “ఆది పురుష్” టీజర్ పై ట్రోల్లింగ్ భారీ ఎత్తున జరుగుతోంది. గ్రాఫిక్స్ అసలు బాగోలేదని టాక్ నడుస్తోంది. టామ్ అండ్ జెర్రీ, కార్టూన్ బొమ్మల మాదిరిగా..”ఆది పురుష్” టీజర్ నీ పోల్చుతున్నారు.
ప్రభాస్ అభిమానులు చాలా నిరోత్సాహంగా ఉన్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క దర్శకుడు మరియు నిర్మాతలు “ఆది పురుష్” థియేటర్ లో బొమ్మ వేరేలా ఉంటుంది అని అంటున్నారు. “బాహుబలి 2” వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాహో, రాదేశ్యామ్ రెండు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. పరిస్థితి ఇలా ఉండగా “ఆది పురుష్” టీజర్ చూశాక ఫ్యాన్స్ మరింత టెన్షన్ పడుతున్నారు.