Adipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కాబోతుంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ సీత పాత్రలో కృతి సనన్ నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతూ ఉంది. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయడానికి నిర్వాహకులు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతిలో చాలా ఘనంగా నిర్వహించడానికి సినిమా యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.
లక్షలాది మంది అభిమానులు హాజరయ్యేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. “ఆదిపురుష్” తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అదేవిధంగా ఈ వేడుకలో 200 మంది సింగర్స్ చేత పెర్ఫార్మెన్స్ చేయించబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి “జైశ్రీరామ్” అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సాంగ్ లైవ్ లో పాడించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు ఏ సినిమా వేడుక జరగని విధంగా ఈ వేడుక చేయాలని డైరెక్టర్ ఓమ్ రౌత్.. స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట.
దీంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్న జీయర్ స్వామిని… ఆహ్వానించడం జరిగిందట. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. జూన్ 6 సోమవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో వేడుక జరగబోతుందని స్పష్టం చేశారు. “ఆదిపురుష్” వాస్తవానికి జనవరి నెలలో విడుదల కావాల్సిన సినిమా. కానీ ప్రారంభంలో సినిమాలో గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సరిగ్గా లేకపోవడంతో… చాలా నెగెటివిటీ రావటం జరిగింది. “ఆదిపురుష్” ట్రైలర్ విడుదలైన సమయంలో భయంకరంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో సినిమాని జూన్ నెలకి వాయిదా వేసి గ్రాఫిక్స్ వర్క్ మొత్తం మార్చి.. సరికొత్త మార్పులతో ఎఫెక్ట్స్ తో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఆదిపురుష్” రెండో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారట. ఈ ట్రైలర్ లో రాముడు… రావణుడు మధ్య యుద్ధ సన్నివేశాలను చూపించనున్నట్లు సమాచారం.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!