Adivi Sesh: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ హీరో.. త్వరలోనే `మేజర్` అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో.. అడివి శేష్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయితే ఆయా ఇంటర్వ్యూల్లో `పెళ్లెప్పుడు..?` అనే ప్రశ్న ఆయనకు తరచూ ఎదురవుతూనే ఉండటంతో.. తాజాగా శేష్ తన పెళ్లిని ప్రభాస్, అనుష్కలతో ముడిపెట్టేశాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
`ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్లు చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్ అనుష్క ఉంది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ కు ఇంకా అవ్వలేదు. వాళ్ల పెళ్లిళ్లు అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా.` అంటూ అడివి శేష్ సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, చాలా లవ్ ప్రపోజల్స్ వచ్చాయని, కొన్ని సార్లు పెళ్లయిన వాళ్లు కూడా వచ్చి ప్రపోజ్ చేశారని శేష్ తెలిపాడు. అలాగే తనను పెళ్లి చేసుకోమని అమ్మ రోజూ సతాయిస్తోందని, అమ్మాయైతే చాలు పెళ్లి చేసుకో అనే స్థాయికి అమ్మ వచ్చేసిందని, కానీ, ఇప్పటి వరకు తనకు ఎవ్వరూ సెట్ కాలేదని చెప్పుకొచ్చాడు. దీంతో శేష్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.