Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తొలి పాన్ ఇండియా చిత్రం `మేజర్`. 2008 ముంబై ఉగ్రవాదుల దాడుల్లో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది.
శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ లో నిర్మితమైన ఈ మూవీ జూన్ 3 అంటే మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ అలరించబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవువుతున్నాయి. దాని ప్రకారం ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్ లో రూ. 2 కోట్లు, ఏపీలో రూ. 4.50 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా లో రూ. 1 కోటి, ఓవర్సీస్లో రూ. 2 కోట్లతో సహా మొత్తం రూ. 13 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట.
దీంతో అడివి శేష్ తెలుగులో హిట్ కొట్టాలంటే.. రూ. 14 కోట్ల మేర షేర్ను రాబట్టాల్సి ఉంటుంది. ఇక పాజిటివ్ టాక్ కనుక సొంతం చేసుకుంటే ఈ బిజినెస్ ను అందుకోవడం శేష్కు ఏమాత్రం కష్టం కాదనే అని సినీ విశ్లేషకులు.