Oscar Film: నటుడిగా అడవి శేష్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. లుక్ పరంగా మంచి గ్లామర్ ఉన్నాగాని.. పాత్రకి తగ్గట్టు సినిమాలు ఒప్పుకుంటూ చాలా తెలివిగా కెరీర్ పరంగా రాణిస్తున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక భాషల్లో నటిస్తూ ఉన్న అడివి శేష్ తెలుగులో హీరోగా మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపోర్ట్ రోల్ పాత్రలు కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. అప్పట్లో విష్ణు దర్శకత్వంలో పవన్ నటించిన పంజా సినిమాలో విలన్ పాత్ర చేయగా తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన “బాహుబలి” సినిమాలో విలన్ పాత్ర చేసి.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు.
ప్రజెంట్ మేజర్ అనే సినిమా లో హీరో గా అడివి శేష్ చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా మే నెలలో రిలీజ్ కానుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో భారీ సినిమా అడవి శేషు ఒప్పుకోవడం జరిగింది. అది కూడా ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా. ఈ సినిమాని హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ లోకి హిందీ లో రీమేక్ చేయనున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా రీసెంట్ ఇంటర్వ్యూ అడివి శేష్ తెలియజేశాడు. ప్రజెంట్ అనేక సినిమాలు లైన్ లో ఉన్నాయి. వాటన్నిటిలో స్పెషల్ ఒక ఆస్కార్ ఫిలిం స్ట్రైట్ గా హిందీలో చేస్తున్నాను. ఈ సినిమానే “ది కాశ్మీరీ ఫైల్స్” నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. హిందీ లో భారీ ఎత్తున ఈ ఆస్కార్ రీమేక్ సినిమా నిర్మాణం జరగనుందని బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరోపక్క మేజర్ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వరకు క్లైమాక్స్కి వచ్చినట్లు… మే రెండవ వారం నుండి డి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో అడివి శేష్ పాల్గొననున్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.