Adivi Sesh: ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.ఈ విధంగా ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు అడుగుపెట్టి మంచి విషయాన్ని అందుకుంటున్నారు. ఇలాంటి వారిలో నాచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండలాంటివాళ్ళు ఒకరని చెప్పవచ్చు. ఇలాంటి కోవకు చెందిన మరొక హీరో అడివి శేష్ .
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతోనే కమర్షియల్ చిత్రాలలో నటించడం కాకుండా కాన్సెప్ట్ సినిమాలు చేయడంతో మంచి విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే అడివి శేష్ సినిమా వస్తుందంటే చాలు అది పక్కా హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. ఈ విధంగా ఎంతో మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న శేష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.
కెరియర్ మొదట్లో శేష్ పంజా, బాహుబలి, బలుపు వంటి చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా అడివి శేష్ నటిస్తున్న మేజర్ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు . మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్రిన్స్ మహేష్ బాబు నిర్మించడం విశేషం.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.
పాన్ ఇండియా హీరోగా అడివి శేష్:
ప్రస్తుతం అడివి శేష్ నటిస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్నాయి. ఈ తరహాలోనే అడివి శేష్ “మేజర్” చిత్రం తెరకెక్కుతోంది.ఇదే కాకుండా మరోవైపు గూఢచారి 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ చిత్రమని చెప్పవచ్చు. ఈ సినిమాకు అడివి శేష్ స్క్రిప్ట్ అందించడం విశేషం. అదేవిధంగా నాచురల్ స్టార్ నాని నిర్మాతగా హిట్ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుతం మూడు అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో
అడివి శేష్ నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలతో ఇతని మార్కెట్ రూ.30 నుంచి 40 కోట్ల వరకు చేరుతుందని అంచనా. ఈ మూడు సినిమాల ద్వారా అడివి శేష్ రేంజ్ పెరుగుతుందని చెప్పవచ్చు.