సినిమా రంగంలో కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశం అలాంటిదే. వివరాల్లోకెళ్తే 2008లో రవితేజ, వి.వి.వినాయక్ కాంబినేషన్లో విడుదలైన `కృష్ణ` చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. సాధారణంగా మన నిర్మాతలు హిట్ కాంబినేషన్ను రిపీట్ చేయాలనుకుంటారు. అయితే, ఏం విచిత్రమో కానీ రవితేజ, వినాయక్ కాంబినేషన్ల సినిమా మళ్లీ రాలేదు. అయితే 11 ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబినేషన్లో సినిమా రానుంది.
వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణతో సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి. బాలకృష్ణ `యన్.టి.ఆర్` బయోపిక్ తో బిజీగా ఉన్నాడు కదా.. తదుపరి తనకే ఛాన్స్ఇస్తాడేమోనని .. చాలా రోజులుగా వినాయక్ కూడా బాలయ్య కోసం వెయిట్ చేశాడు. అయితే బాలయ్య `యన్.టి.ఆర్` బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీనుకి అవకాశం ఇచ్చాడే కానీ.. వినాయక్ను హోల్డ్లో పెట్టేశాడు. దీంతో వినాయక్ రీసెంట్గా రవితేజను కలిసి కథను వినిపించాడట. రవితేజ కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. సి.కల్యాణ్ నిర్మాణంలోనే ఈ సినిమా ఉండే అవకాశాలున్నాయి. ఏదైతేనేం.. ఎన్ని మలుపులు తిరిగితేనేం.. వినాయక్, రవితేజ వంటి హిట్ కాంబోలో మరో సినిమా రానుందని టాక్.