Golden Globe Award’s: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలనచిత్ర రంగం యొక్క సత్తా చాటుతూ ఉంది. అంతకుముందు మూడు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో “నాటు నాటు” పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు లభించింది. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి మరోసారి “RRR” సీక్వెల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా కొనసాగించడానికి అద్భుతమైన ఐడియా వచ్చిందని పేర్కొన్నారు. ఆ ఐడియాని స్క్రిప్ట్ కింద మలచటానికి తన టీం పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సినిమా విడుదలై మంచి ఆదరణ పొందినప్పుడు… మేము కూడా సీక్వెల్ చేయాలని ఆలోచన వచ్చింది. ఆ సమయంలో అనేక ఐడియాలు వచ్చాయి. అయితే బలవంతంగా సీక్వెల్ చేయకూడదు. కానీ తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ లలో కూడా “RRR” సీక్వెల్ గురించి ప్రశ్న లేదురా లేనప్పుడు వచ్చిన ఆదరణబట్టి కొన్ని వారాల క్రితం మా నాన్న.. కజిన్ ఇంకా టీంతో చర్చలు జరిపాను. ఆ సమయంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. దానిని ఇప్పుడు కథగా రాయటం స్టార్ట్ చేసాము. పూర్తి స్క్రిప్ట్ వచ్చేదాకా సీక్వెల్ విషయంలో ముందుకు అడుగు వేయలేం.
ప్రస్తుతం మాత్రం సీక్వెల్ స్క్రిప్ట్ పనిలో ఉన్నాము అని రాజమౌళి వెల్లడించారు. సినిమా రంగంలో చాలా ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న “RRR” కి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చంద్రబాబు, చిరంజీవి ఇంకా పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇదే రీతిలో ఆస్కార్ కూడా గెలవాలని… సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!