RRR: బాహుబలి(Bahubali) పుణ్యమా తెలుగు సినిమా స్థాయి తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి మంచి పేరు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఒకానొక టైంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది కేవలం బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీ.. అన్న తరహాలో పరిస్థితి ఉండేది. కానీ జక్కన్న ఎప్పుడైతే బాహుబలి తెరకెక్కించడం జరిగిందో… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై ఉన్న దృష్టి సరికొత్తగా ఏర్పడింది. ఇటువంటి తరుణంలో చాలావరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో కు చెందిన హీరోలు పాన్ ఇండియా నేపథ్యం కలిగిన సినిమాలను చేస్తూ ఉన్నారు.
తెలుగు, హిందీ హీరోలు అనే తేడా లేకుండా ఎవరికి వారు పాన్ ఇండియా కథలు ఎంచుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చాలావరకు టాలీవుడ్(Tollywood) కే పరిమితం అయ్యేలా రాణించడం జరిగింది. కొద్దో గొప్పో కన్నడంలో మినహా ఇంకా మరే ఇండస్ట్రీలో ఎన్టీఆర్(NTR) కి పెద్దగా క్రేజ్ లేదు అని చాలామంది అంటారు. కానీ టాలెంట్ పరంగా చూసుకుంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చాలామంది మహామహులు చెబుతుంటారు. తారక్ తో పోటి పడి నటించడానికి మహామహులే భయపడుతున్నారని.. కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించే వాళ్ళు చెబుతుంటారు.
నటన పరంగా ఎవరెస్టు లాంటి టాలెంట్ ఉన్నాగాని క్రేజ్ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ కే పరిమితం కావడంతో ఎన్టీఆర్ ఇక నుండి.. పాన్ ఇండియా నేపథ్యం కలిగిన సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయారు అంట. దీంతో RRR తర్వాత మొత్తం సబ్జెక్టులు అన్ని పాన్ ఇండియా స్టోరీలను డీల్ చేసే దర్శకులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారట. ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ(Koratala Shiva) ఆ తర్వాత అట్లీ, “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) లాంటి వారికి ఎన్టీఆర్ అవకాశాలు ఇవ్వటానికి గల కారణం పాన్ ఇండియా మార్కెట్ లో రాణించడమే ని ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…