కొంత మంది హీరోలు, దర్శకులకు మధ్య సినిమా బాండింగ్ ఏర్పడితే అంత సులువుగా తెగదు. ఇప్పడు సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ మధ్య అలాంటి అనుబంధమే కొనసాగుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రూపొందాయి. రోబో, శివాజీ ది బాస్, రోబో సీక్వెల్ 2.0.. ఈ చిత్రాల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో నాలుగోసారి ఓ సినిమా తెరకెక్కనుంది. శివాజీ ది బాస్ స్టయిల్లో ఓ సైంటిఫిక్షన్ కథతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను చేయడానికి శంకర్ ఆసక్తిగా ఉన్నాడట. ఎ.ఆర్.మురుగదాస్ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన సహా సినిమాను 10 మాసాల్లో పూర్తి చేయాలనేదే కండీషన్. ఎందుకంటే తర్వాత రజనీకాంత్ .. రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారు రజనీకాంత్.
previous post