Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో సమంత ఇప్పటికే మూడుసార్లు నటించడం తెలిసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు(Dookudu), బ్రహ్మోత్సవం(Brahmotsavam) సినిమాలో సమంత యాక్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మరోసారి మహేష్ బాబు పక్కన సమంత నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
అయితే ఫస్ట్ ఏ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే(Pooja Heghde) నీ కన్ఫామ్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం పూజా హెగ్డే డేట్లు సరిపోక పోవటంతో పాటు.. ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో… హీరోయిన్ పాత్రలో సమంతాని తీసుకోవడానికి… త్రివిక్రమ్, మహేష్ డిసైడ్ అయినట్లు లేటెస్ట్ టాక్. చాలా త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని ఈ నేపథ్యంలో… పూజా హెగ్డే తేదీలు దొరకకపోవడంతో… సమంతాకి త్రివిక్రమ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తక్కువ టైం లో కంప్లైంట్ చేయాలంటే ఇదే సరైన నిర్ణయం అని డిసైడ్ అయినట్లు.. ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే విక్రమ్ సినిమా స్టార్ట్ చేసి కొద్ది నెలలలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. అతడు ఖలేజా తర్వాత మూడోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించబోయే ఈ సినిమా స్టొరీ పై అభిమానులకు భారీ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మహేష్ నటనలో చాలా వేరియేషన్స్ బయటికి తీసుకు వచ్చింది డైరెక్టర్ త్రివిక్రమ్. అతడు లో సైలెంట్ మహేష్ ని కలేజా లో.. మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ ని.. అద్భుతంగా స్క్రీన్ మీద చూపించండి. దీంతో ఈ మూడో సినిమాలో మహేష్.. నటనలో ఎటువంటి యాంగిల్ బయటపెడతాడు అనేదాని గురించి ఫాన్స్ డిస్కషన్స్ చేసుకుంటున్నారు.