Dhanush-Aishwarya: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2004లో ధనుష్, ఐశ్వర్యల వివాహం జరిగింది. ఆ సమయానికి ధనుష్ వయసు కేవలం 21 ఏళ్లే కాగా.. ఐశ్వర్య ధనుష్ కంటే రెండు సంవత్సరాలు పెద్ద అవ్వడం గమనార్హం. దీంతో వీరి పెళ్లిపై అప్పట్లోనే ఎన్నో విమర్శులు వచ్చాయి.
కానీ, అవేమి పట్టించుకోకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ జంట.. పెళ్లైన 18 ఏళ్లకు విడాకులు తీసుకోవడంతో అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరినీ కలిపేందుకు ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదని వార్తలు వచ్చాయి.
అయితే భర్త నుంచి విడిపోయినప్పటికీ ఐశ్వర్య తన ట్విట్టర్ ఖాతా పేరుకు వెనుక ఉన్న ధనుష్ ను తొలగించలేదు. దీంతో, వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉండొచ్చని అభిమానులు ఆశపడ్డారు. కానీ, ఇప్పుడు ఆ ఆశ సైతం లేనట్టే అని చెప్పాలి. ఎందుకంటే, ఐశ్వర్య ట్విట్టర్లో సైతం ధనుస్ను వదిలించుకుంది.
అవును, తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పేరు వెనుక పెట్టుకున్న ధనుష్ ను తొలగించింది. ఆ స్థానంలో తన తండ్రి రజనీకాంత్ పేరును పెట్టుకుంది. దీంతో ఇకపై ధనుష్ ను మళ్లీ కలిసే అవకాశమే లేదని ఐశ్వర్య స్పష్టంగా చెప్పినట్టయిందని అంటున్నారు.