సూపర్స్టార్ రజనీకాంత్ పెద్దకుమార్తె.. హీరో ధనుశ్ సతీమణి నిర్మాత, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఈమె సినిమా రంగానికి సంబంధం లేని క్రీడా రంగంలోకి అడుగుపెడుతున్నారు. వివరాల్లోకెళ్తే ఈ నెల 25న ఢిల్లీలో టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో చెన్నై జట్టు నిర్వాహక భాగస్వాముల్లో ఒకరిగా ఐశ్వర్యా ధనుష్ మారారు. ఈ పోటీలు ఢిల్లీ, చెన్నై, పూనే, గోవా, కోల్కతా, ముంబై జట్ల మధ్య జరగబోతున్నాయి.