ఇప్పటికే చైనా మార్కెట్పై బాలీవుడ్ సినిమాలు దండెత్తుతున్నాయి. ఇప్పుడు క్రమంగా దక్షిణాది సినిమాలు కూడా చైనాలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. తమిళం నుండి ఆ ప్రయత్నాన్ని స్టార్ట్ చేస్తుంది మాత్రం అజిత్. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `నెర్కొండ పార్వై`. బోనీకపూర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విద్యాబాలన్, శ్రద్ధాశ్రీనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. `ఖాకి` ఫేమ్ హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 10న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగుతో పాటు చైనాలో సినిమాను రిలీజ్ చేసేలా బోనీ ప్లాన్ చేస్తున్నాడట. హిందీ చిత్రం `పింక్`కు రీమేక్ ఇది. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ పోషించిన ఈ పాత్రను తమిళంలో అజిత్ పోషిస్తున్నారు.
previous post
next post