దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడీయన. ఇప్పుడు ఈయన తనయుడు కార్తికేయ నిర్మాతగా మారాడు. కార్తికేయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఆకాశవాణి`. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయమొకటి తెలిసింది. సినిమా కథంతా విలన్ చుట్టూనే తిరుగుతుంది. విలన్గా కొత్త నటుడు నటించాడు. ఆ పాత్ర చిత్రీకరణ విధానం, పాత్రలో నటించిన నటుడు పెర్ఫాఎమన్స్ రాజమౌళికి నచ్చలేదట. ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించాడు. దీంతో చిత్ర యూనిట్ రాజమౌళి సలహాలను పాటిస్తూ ఆ సన్నివేశాలను రీ షూట్ చేశారట. అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా సెప్టెంబర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
previous post
next post