Akhanda: నందమూరి బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా “అఖండ” టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో సినిమా థియేటర్ల విషయంలో అనేక ఇబ్బందులు ఉన్న సమయంలో మరో పక్క ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించిన ఈ పరిస్థితుల్లో సినిమా వ్యాపారం అటోఇటో అన్న చందంగా మారుతున్న క్రమంలో బాలయ్యబాబు డేరింగ్ అండ్ డాషింగ్ గా సినిమా రిలీజ్ చేసి.. కలెక్షన్లు కొల్లగొట్టాడు.
తన కెరీర్ లోనే అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా అఖండ నీ.. మొదటి స్థానంలో నిలబెట్టాడు. బ్రేకుల్లేని బుల్డోజర్ అన్న మాదిరిగానే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన సొమ్మును లాభాలు నిర్మాతలకు వచ్చేలా చేశాడు. అఖండ సినిమా రిలీజ్ కాక ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు.. ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ముఖ్యంగా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన సంగీతం… సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది.
అఘోర పాత్రలో బాలయ్య చేసిన పెర్ఫార్మెన్స్ కి… ఫైట్లకి తమన్ అందించిన మ్యూజిక్.. ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా అఖండ కలెక్షన్లలో 200 కోట్ల రికార్డును సాధించి టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు ఏకంగా 100 సెంటర్లలో 50 రోజులు… సినిమా ఆడి … సినిమా వ్యాపారానికి ఎటువంటి డోకా లేదని నిరూపించింది. నెలన్నర దాటిన అదే దూకుడుతో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడం.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 50 రోజులు దిగ్విజయంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో తాజాగా సినిమా హీరోయిన్ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ఈ రోజు సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.