Akhil Akkineni: `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` సినిమాతో ఎట్టకేలకు హిట్ ట్రాక్ ఎక్కిన అక్కినేని అఖిల్.. ప్రస్తుతం `ఏజెంట్` అనే మూవీ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య, అతుల్య రవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కనిపించబోతున్నారు.
ఏకే ఎంటర్టైనమెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకరతో కలిసి సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి అఖిల్ పైసా రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం లేదట.
కానీ, సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో మాత్రం షేర్ తీసుకోనున్నాడట. ఈ మేరకు అఖిల్ ముందే అగ్రిమెంట్ రాసిచ్చాడని.. ఈ కారణంగానే పారితోషకం పుచ్చుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
కాగా, స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.