యువ కథానాయకుడు అఖిల్కు హీరోయిన్ సమస్య ఇంకా తీరనేలేదు. అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో జిఎపిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ కలయికలో ఓ సినిమా రూపొందనుంది. రీసెంట్గా పూజా కార్యక్రమాలు ముగిసినా సినిమా సెట్స్పైకి వెళ్లలేదు. అందుకు కారణం అఖిల్కు హీరోయిన్ దొరకలేదు. అఖిల్ సరసన కియరా అద్వాని, పూజా హెగ్డే వంటి పేర్లు ప్రముఖంగా వినపడినప్పటికీ వారెవరూ చివరకు ఖరారు కాలేదు. దీంతో ఇప్పుడు నిర్మాణ సంస్థ నివేదా పేతురాజ్ను తీసుకోవాలని ఆలోచిస్తుందట. `మెంటల్ మదిలో`, `చిత్రలహరి` సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ బన్ని సినిమాలో నటిస్తుంది. అలాగే రామ్ చేయబోయే రీమేక్ సినిమాలోనూ నటిస్తుంది. కాగా.. ఇప్పుడు అఖిల్ సినిమాలోనూ నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.
previous post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!