Ala Vaikuntapuram lo: గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డు మొత్తం తిరగరాసింది. వరస ఫ్లాపుల్లో ఉన్న అల్లు అర్జున్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా .. గత ఏడాది ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కరోనా వైరస్ రావటంతో సినిమా ధియేటర్ లో మొత్తం క్లోజ్ అవ్వటంతో పరిస్థితులు మొత్తం తలకిందులు కావడంతో 2020 ఏడాదికి అలా వైకుంఠపురం లో సినిమా ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది.
వరస ఫ్లాపుల్లో ఉన్న అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకుని సినిమా చేయడంతో .. పాటు త్రివిక్రమ్ పంచ్ టేకింగ్ మెస్మ రైజింగ్ గా ఉండటంతో.. బన్నీ కెరీర్ లోనే అల వైకుంఠ పురం లో సినిమా.. రికార్డు కలెక్షన్లు సాధించింది. అటువంటి ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయటానికి బాలీవుడ్ బడా నిర్మాతలు సినిమా హక్కులకోసం నిర్మాత అల్లు అరవింద్ వెంట పడుతున్నారట.
Read More: Allu arjun : అల్లు అర్జున్ వెనక స్టార్ డైరెక్టర్..పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ సెట్ చేస్తారా..?
ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత అరవిందుతో మాట్లాడినట్లు .. అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అంతా ఓకే అయితే అల్లు అర్జున్ పూజా హెగ్డే ప్లేసులో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ హీరోయిన్లుగా చేయటానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం వర్గాలలో వార్తలు వస్తున్నాయి. అలా వైకుంఠపురం లో సినిమా కంటే ఎక్కువగా మ్యూజికల్ గా భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకోవడంతో .. అదే సమయంలో త్రివిక్రమ్ టేకింగ్ వర్కౌట్ కావటంతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేసింది. మరి హిందీలో రీమేక్ అయితే ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?