భారతీయ చలనచిత్ర రంగంలో ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సినిమా ప్రపంచానికి భారతదేశ విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ గురించే మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి” పుణ్యమా.. దక్షిణాది సినిమా రంగం యొక్క సత్తా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది. ఒకప్పుడు దక్షిణాది సినిమాలను మరియు నటీనటులను ఎగతాళి చేసే బాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలు కూడా… ఇప్పుడు దక్షిణాది సినిమాలకి పోటీ ఇవ్వలేకపోతున్నాయి.
పాండమిక్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలు ఇప్పటికీ కూడా సరైన హిట్ ఒకటి కూడా అందుకోలేకపోవడం జరిగింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లు సైతం దక్షిణాది సినిమా రంగానికి చెందిన దర్శకులతో పనిచేసే పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని పేర్కొంది.
ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీపై దయ తలచిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలే విజయం సాధిస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ దక్షిణాదిలో విడుదలైన ప్రతి సినిమా హిట్ అవటం లేదు. మంచి కంటెంట్ కలిగిన సినిమాలే విజయం సాధిస్తున్నాయి. కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఎక్కడైన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ ఆలియా భట్ ఇటీవల ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆలియా భట్ ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో “RRR” లో రామ్ చరణ్ కి జోడిగా నటించి మంచి క్రేజ్ సౌత్ లో అందుకుంది. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో పెళ్లి కావడంతో చాలా వరకు సైలెంట్ అయినా.. ఆలియా భట్ తాజాగా సౌత్ సినిమాలపై ఈ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.