రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పోరాట యోధులు కొమరం భీం గా ఎన్.టి.ఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజుగా రాం చరణ్ నటిస్తుండగా భారీ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఇక లాక్ డౌన్ ఉన్నప్పటికి షూటింగ్స్ కి పర్మిషన్ రావడంతో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని మొదలు పెడదామంటే పరిస్థితులు అనుకూలించడం లేదు.
ఇప్పటికే ఓవర్ బడ్జెట్ అవుతుందని నిర్మాత ఒక పక్క రాజమౌళి ని ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయినా రాజమౌళి ఇవన్ని పట్టించుకోకుండా ఆర్ ఆర్ ఆర్ ని తిరిగి షూటింగ్ మొదలు పెడదామంటే ఇందులో ఎక్కువమంది బాలీవుడ్ హాలీవుడ్ నటులుండటం తో సాధ్యపడటం లేదు. దానికి తోడు మన స్టార్ హీరోలు కూడా ఇప్పట్లో షూటింగ్ కి హాజరవడానికి సిద్దంగా లేరని తెలుస్తుంది.
మొత్తానికి రాజమౌళి కి ప్రతీ ఒక్కటి తలనొప్పిగానే తయారవుతున్నాయి. అసలే షూటింగ్ ఎలా మొదలు పెట్టాలి ఎలా బడ్జెట్ కంట్రోల్ చేయాలి ..అంటూ నానా ఇబ్బందులు పడుతుంటే ఆ మధ్య శ్రియ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తుందంటూ సీక్రెట్ రివీల్ చేసి రాజమౌళి కి షాకిచ్చింది. ఆయన గోప్యంగా ఉంచిన విషయాన్ని ఎగ్జైట్మెంట్ తో శ్రియ బయట పెట్టేసి తుస్సు మనిపించింది. ఇప్పుడేమో ఆర్ ఆర్ ఆర్ నుండి ఆలియా భట్ తప్పుకుందన్న ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇది నిజమా అంటూ అందరూ రాజమౌళిని ఆరా తీస్తున్నారట. ఆలియా తప్పుకోలేంటూ అందరికి చెప్పలేకపోతున్నారట రాజమౌళి. ఉన్న తలనొప్పులలో ఆలియా గురించి క్లారిటీ ఇస్తుండాల్సి రావడం మరో తలనొప్పిగా మారిందట.