ఖాళీ లేకుండా సినిమాలు చేస్తుందంటే తమన్నా భాటియా మాత్రమే. కమర్షియల్ సినిమాలతో పాటు బాహుబలి, సైరా వంటి పాన్ ఇండియా సినిమాలలో తమన్నా తన సత్తా చాటుతోంది. అంతేకాదు మార్కెట్ పరంగా కూడా తమన్నా కి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో చాలా క్రేజ్ ఉంది. చరణ్ సరసన చిరంజీవి సరసన ..కూడా సరిపోయో హీరోయిన్ అన్న క్రేజ్ ని కొనసాగిస్తుంది.
ఇక ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సీటీమార్ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఇద్దరు కబడ్డీ కోచ్ లు గా నటిస్తున్నారు. ఇక దర్శకుడు సంపత్ నందికి తమన్నాకి మంచి ట్యూనింగ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రచ్చ, బెంగాల్ టైగర్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. అదే సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ సంపత్ నంది మరోసారి సీటీమార్ లో తమన్నా ని ఎంచుకున్నాడు.
ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూ ఫాం లో ఉన్న తమన్నాకి ఓటీటీలో మంచి ఆఫర్ వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కి సంబంధించిన ఆహా యాప్ లో ఒక టాక్ షో నిర్వహిస్తున్నారు. ఈ టాక్ షోకి తమన్నా హోస్ట్ గా వ్యవహరించేందుకు ఎపిసోడ్ కి 8 నుంచి 10 లక్షలు ఆఫర్ చేశారట. ఇదంతా తనకున్న క్రేజ్ వల్లే అని అంటున్నారు. ఇక ఈ టాక్ షోలో మెగా హీరోల తో పాటు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అందరు పాల్గొనబోతున్నారట.