Allu Aravind: గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద బ్యానర్ గా క్వాలిటీ కలిగిన సినిమాలను తీస్తూ గీతా ఆర్ట్స్ కి నిర్మాతగా అల్లు అరవింద్ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా సినిమాలను నిర్మించడం జరిగింది. కాగా ఏడాది క్రితం ఆహాతో ఓటిటి రంగంలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ ఇటీవల స్టూడియో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా విజయవంతంగా రాణిస్తున్న అల్లు అరవింద్ తాజాగా “ఆలీతో సరదాగా” కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఇంకా చిరంజీవి కుటుంబం ఇంకా తన కుటుంబానికి సంబంధించి అనేక కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. అలాగే తండ్రి స్వర్గీయ అల్లు రామలింగయ్య గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలో కొడుకు బన్నీ ఇంక మేనల్లుడు రామ్ చరణ్ లతో కలిపి మల్టీస్టారర్ సినిమా తీయాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వీరితో చేయాలనుకుంటున్నా ఈ మల్టీ స్టార్ ప్రాజెక్ట్ కి సంబంధించి టైటిల్ కూడా రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. “చరణ్ అర్జున్” అనే టైటిల్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఎప్పుడో ఒకప్పుడు తన కోరిక తప్పకుండా తీరుతుందని నమ్మకం ఉందని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో తన డ్రీం ప్రాజెక్ట్ “రామాయణం” పక్కన పెట్టలేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది “రామాయణం” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాదిన్నర నుంచి జరుగుతున్నాయని భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క అయితే.. “రామాయణం” నిర్మించడం అనేది చాలా పెద్ద ప్రయత్నం అని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!