ప్రభాస్ తన తొలి బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ప్రకటించడంతో టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయా? రామాయణం ఇతిహాసాన్ని బేస్ చేసుకొని వస్తున్న ఆదిపురుష్ సినిమా మెగా ప్రొడ్యూసర్ కు నిద్రపోనీయడం లేదా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
అసలు స్టోరీ ఏంటంటే? అల్లు అరవింద్ కు ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమాను తీయాలనే కోరిక ఉన్నదట. దానికోసమే 1500 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా అరవింద్ రెడీ అయిపోయాడు. ఒక్కరితో కాదు.. చాలామంది హీరోలతో ఆ సినిమాను ప్లాన్ చేశాడు. ఆ పాన్ ఇండియా సినిమా కోసం రామాయణాన్నే ఎంచుకున్నాడు అరవింద్. దాన్ని మూడు పార్టులుగా తీయాలని భావించాడు.
ఇతిహాసాలపై సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి. దానికి ఎంతో ఓర్పు ఉన్న డైరెక్టర్ కావాలి. దాని కోసమే.. చిచోరే డైరెక్టర్ నితీశ్ తివారీని అల్లు అరవింద్ తన కలల ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. తనతో పాటుగా మరికొందరు బాలీవుడ్ నిర్మాతలతో ఈ సినిమాను ప్లాన్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తో పాటు.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను కూడా మెయిన్ రోల్ లో ఈ ప్రాజెక్టు కోసం తీసుకుందామనుకున్నాడు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని… తన కలల ప్రాజెక్టు గురించి గత సంవత్సరమే బయట పెట్టాడు. దీంతో తెలుగు సినిమా అభిమానులు కూడా ఖుషీ అయ్యారు. తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపిస్తోంది.. తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగిపోతోందని సంబుర పడ్డారు.
అయితే.. ఆ తర్వాత మాత్రం ఆ ప్రాజెక్టు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అరవింద్. అసలు రామాయణం మీద అరవింద్ సినిమా ఉంటుందా ఉండదా? అని తెలుగు సినిమా అభిమానులు ఎదురుచూస్తున్నవేళ.. సడెన్ గా ప్రభాస్.. ఆదిపురుష్ ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చింది.
ఈ సినిమాను కూడా ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ డైరెక్ట్ చేస్తుండటం.. ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ ఈ సినిమాలో నటిస్తుండటం.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా వస్తుండటం… అది కూడా తను కలలు కన్న రామాయణం కాన్సెప్ట్ మీదనే కావడంతో తన కలల ప్రాజెక్టు ఆశలన్నీ అడియాశలయ్యాయి.. అని భావిస్తున్నట్టే అని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఇక.. ఆ సినిమా వచ్చాక.. అంత భారీ ఖర్చు పెట్టి అదే కాన్సెప్ట్ తో మళ్లీ అదే సినిమాను అరవింద్ ఎందుకు తీస్తాడు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ను అటకెక్కిస్తాడు.. అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. చూద్దాం.. అసలు అరవింద్ తన కలల ప్రాజెక్టు గురించి ఇప్పుడైనా నోరు విప్పుతాడో లేదో?