ఆర్య, ఆర్య 2 తర్వాత బన్ని, సుకుమార్ కాంబినేషన్లో సినిమా రూపొందనుందని అధికారిక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్ని చేయబోయే సినిమా సెట్స్కు వెళుతుంది. ఇందులో బన్ని పార్ట్ను వీలైనంత తర్వగా ముగించేసి తర్వాత సుకుమార్ సినిమాను స్టార్ట్ చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో బన్ని చేయబోయే సినిమా ఓ అడవి బందిపోటు కథ అని ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. శ్రీశైలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించిన పాయింట్. శ్రీశైలం అడవుల్లో జరిగే అన్యాయాలను ఓ అడవి బందిపోటు ఎలా ఆపాడనేదే సినిమా కథ అంటున్నారు. వినపడుతున్న వార్తల ప్రకారం ఈ కథ చిరంజీవి `కొండ వీటి దొంగ` కథకు దగ్గరగా ఉంది కదూ. ఆ సినిమాలో కూడా కొండవీడు అనే ఓ అటవీ ప్రాంతంలోని గిరిజనులను కొందరు దోచుకుని హింసిస్తుంటే.. కలెక్టర్ కావాల్సిన కుర్రాడు కొండవీటి దొంగగా మారి అన్యాయాలను ఎదుర్కొన్నాడనేదే సినిమా. ఇప్పుడు బన్ని చేయబోయే కొత్త సినిమా కథకు, కొండవీటి దొంగ కథకు దగ్గర పోలికలున్నట్లు అనిపిస్తున్నాయి మరి. అంటే మావయ్య కథనే మార్చి సుకుమార్ బన్నితో సినిమా చేస్తున్నాడా? తెలియాలంటే ఆగక తప్పదు మరి.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!