మెగా స్టైలిష్ హీరో అల్లు అర్జున్ ఆదివారం వైజాగ్కి వెళ్లనున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన `చాణక్య` ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన అతిథిగా హాజరవుతానని మాటిచ్చారట. గోపీచంద్, మెహరీన్ జంటగా నటంచిన `చాణక్య`ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. తిరు దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ ఇది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో ప్లాన్ చేశారు. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ ఆదివారం `సైరా` ప్రీ రిలీజ్ వేడుక కూడా బెంగుళూరులో జరగనుంది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో మెగా హీరోలందరూ దాదాపుగా కనిపించారు. కానీ అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రం ఈ వేడుకకు ఎందుకు హాజరు కాలేదని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అయ్యాయి. తాజాగా బెంగుళూరు వేడుకలో ఆయన్ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చని అనుకున్నారు. అయితే అదే రోజున ఆయన వైజాగ్కు వెళ్లడానికి కమిట్ అయ్యారు. సో అక్కడికి కూడా అల్లు అర్జున్ వెళ్లరన్నమాట.
మరోవైపు అల్లు అర్జున్ `సైరా`లో గెస్ట్ రోల్లో కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ `అలవైకుంఠపురములో` చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
previous post
next post