Allu Arjun: కన్నడ రాక్స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలను పోషించగా.. రవి బస్రూర్ స్వరాలు అందించారు.
2018లో విడుదలై ఘన విజయం సాధించిన `కేజీఎప్ చాప్టర్ 1`కు కొనసాగింపుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ మరియు హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. విడుదలైన అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. కేవలం ఏడంటే ఏడు రోజుల్లోనే కొండంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ను బద్దలు కొట్టి లాభాల బాట పడ్డింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారు. ఆపై ఈయన సోషల్ మీడియా వేదికగా చిత్ర టీమ్పై ప్రశంసలు కురిపించారు. `కేజీఎఫ్-2 సినిమా యూనిట్ మొత్తానికి ప్రత్యేక అభినందనలు. ఈ సినిమాలో యశ్ నటన అద్భుతం. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి పాత్రలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
అలాగే తన మాస్ డైరెక్షన్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరపై మరోసారి మ్యాజిక్ సృష్టించారు. ఆయన విజన్, కన్విక్షన్ ను గౌరవిస్తున్నాను. సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గొప్ప సినిమాను చూసిన అనుభవాన్ని అందించినందుకు, భారతీయ సినిమాను శిఖర స్థాయిలో నిలిపినందుకు టీమ్ మొత్తానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు.` అంటూ బన్నీ ట్వీట్లు చేశాడు. దీంతో కేజీఎఫ్ 2పై ఈయన రియాక్షన్ నెట్టింట వైరల్గా మారింది.