చాలా సంవత్సరాల తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వటంతో ఆయన అభిమానులకు అవధులు లేకుండా పోయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “వకీల్ సాబ్” అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాకి సంబంధించి ఈ ఏడాది స్టార్ట్ అవ్వగా దాదాపు కొద్ది రోజుల్లోనే 70% సినిమా పవన్ కళ్యాణ్ పూర్తి చేయడం జరిగింది. దీంతో సినిమా సమ్మర్ మే 15వ తారీఖున రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. ఇంతలోనే మహమ్మారి కరోనా వైరస్ రావటంతో లెక్కలు మొత్తం తారుమారయ్యాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో అదే రీతిలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి అల్లు అర్జున్ హీరోయిన్ పూజా హెగ్డే నీ ఇటీవల సెలెక్ట్ చేసినట్లు, ఆమె కూడా పవన్ తో అనేసరికి స్టోరీ ఏమి వినకుండానే ఓకే చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే, గద్దల కొండ గణేష్, సినిమాలలో నటించి, హిట్ లు అందుకుని హరీష్ కి లక్కీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఇదే లక్కీ హీరోయిన్ ని పవన్ తో నటింపజేసే “గబ్బర్ సింగ్” మాదిరిగా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని హరీష్ శంకర్ అనుకుంటున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.