“నాపేరు సూర్య” అట్టర్ ప్లాప్ అవడంతో అల్లు అర్జున్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ కి “అలా వైకుంఠపురం లో” సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించారు. నాన్ బాహుబలి రికార్డులను పగలకొట్టి సరికొత్త రికార్డులు అల్లుఅర్జున్ ఈ సినిమాతో సృష్టించాడు. మరోపక్క “రంగస్థలం” సినిమా తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ సుకుమార్ తాజాగా అల్లు అర్జున్ తో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ కారణంగా సినిమా కి సంబంధించి జరగాల్సిన అవుట్ డోర్ షూటింగ్ ప్రస్తుతం క్యాన్సిల్ అయిపోయింది. ఇదిలా ఉండగా త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.
దీంతో ఇతర దేశాలలో షూటింగ్లకు అనుమతులు వైరస్ వల్ల రాకపోవటంతో సినిమాకి సంబంధించి ఫారెస్ట్ సన్నివేశాలు ఆంధ్ర తెలంగాణలో ఉండే అడవులలో షూటింగ్ ప్లాన్ చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో ఉండే ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించిన స్టోరీ అని…. రెండు రాష్ట్రాల సరిహద్దులలో నివసించే వారి జీవితాల చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి.
కాగా ఇదే బ్యాక్ డ్రాప్ లో తమిళంలో “ఆంధ్ర” అనే సినిమా తెరకెక్కుతుంది అని టాక్. సుకుమార్ సినిమా కంటే ఈ సినిమా ముందే ప్రారంభించడంతో “పుష్ప” సినిమా కి కొంత డామేజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సౌత్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. తాజా పరిస్థితుల వల్ల ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఆగిపోయిన “పుష్ప” సినిమాకి ఇది అంతకంటే పెద్ద డేంజర్ అని సినిమా విశ్లేషకులు అంటున్నారు.