Allu Arjun : “నాపేరు సూర్య” అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత అల్లు అర్జున్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. దాదాపు సంవత్సరం పైగా సినిమాలు చేయకుండా ఆపేసిన అల్లు అర్జున్..ఆ టైంలో అనేక కథలు వినడం జరిగింది. “నా పేరు సూర్య” తర్వాత బన్నీ ఎలాంటి సినిమా చేస్తాడు అన్నదానిపై అప్పట్లో అనేక వార్తలు వస్తున్న తరుణంలో తనకి రెండు మర్చిపోలేని బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో “అలా వైకుంఠపురం లో” సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
2020 మొత్తంగా బన్నీ నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడమే కాక టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి పెద్ద కారణం ఖచ్చితంగా మ్యూజిక్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకి సంబంధించి పాటలు సినిమా రిలీజ్ అవ్వక ముందే భారీ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. “సామజ వర గమన” సాంగ్ అయితే యూట్యూబ్ లో అనేక రికార్డులు సృష్టించింది. సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటివరకు రిలీజ్ అయిన ఏ సినిమా పాటలు క్రియేట్ చేయని తరహాలో “అల వైకుంఠపురం లో” సినిమా పాటలు రికార్డులు సృష్టించాయి.
అయితే ఆ తర్వాత ఆ కరోనా వైరస్ రావటంతో ఆ టైంలో లాక్ డౌన్ లో బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ సాంగ్ బాగా పాపులర్ అయింది. సినిమాలో అల్లు అర్జున్ వేసిన స్టెప్ నీ చాలామంది సెలబ్రిటీలు వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడంతో సాంగ్ కి ఊహించని విధంగా వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వేసిన స్టెప్పులు కి.. సాంగ్ ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అల్లుఅర్జున్.. డేవిడ్ వార్నర్ కి థాంక్స్ కూడా చెప్పటం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సాంగ్ కి మిర్చి మ్యూజిక్ అవార్డు రావటం జరిగింది. ఈ అరుదైన అవార్డు రావడంతో మరోసారి బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.