Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం `పుష్ప`. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ కలిసి నిర్మిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్లో విడుదలై భాక్సీఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇక త్వరలోనే సెకెండ్ పార్ట్ `పుష్ప ది రూల్` సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇందుకు మేకర్స్ అన్ని ఏర్పట్లు చేస్తున్నారు.
అయితే మొదటి భాగానికి రూ. 50 కోట్ల పారితోషికం తీసుకున్న బన్నీ.. రెండో భాగానికి రెమ్యునరేషన్ వద్దన్నాడట. కానీ, ఈ చిత్రానికి పారితోషికం క్రింద హిందీ రైట్స్ డిమాండ్ చేశాడట. అందుకు నిర్మాతలు కాదనలేక ఓకే చెప్పేశారని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే బన్నీ పుష్ప ది రైజ్ కు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఎక్కువ మొత్తంలో అందుకున్నట్లు అవుతుంది.
కాగా, రెండో భాగానికి ప్రస్తుతం స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ కొనసాగుతుంది. శేషాచలం అడవులను శాసించే డాన్గా బన్నీ, ఐపీఎస్ ఆఫీసర్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాసిల్ కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య సంఘర్షణ నేపథ్యంలో సెకెండ్ పార్టు సాగబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి స్వరాలు అందిస్తున్నారు.