స్టైల్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఈస్ట్ గోదావరిలోని మారేడుమిల్లిలో షూటింగ్ షురూ చేయగా చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా సోకింది. ఆ దెబ్బతో షూటింగ్ ఆపేసి అంత సర్దుకొని హైదరాబాదుకు వచ్చారు. ఆ తరువాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సారి పటిష్టమైన ఏర్పాట్ల మధ్య షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం.
శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. బన్నీ ఈ చిత్రంలో మొదట స్మగ్లింగ్ చేసే కూలీగా చేరి ఆ తురువాత పెద్ద స్మగ్లర్ గా మారనున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన బన్నీ పక్కన నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ శివారులో జరగనున్నట్టు సమాచారం. ఈసారి కట్టుదిట్టమైన జాగ్రత్తలతో షూటింగ్ చేయబోతున్నట్టు, తక్కువ మందితో టీంతో సుకుమార్ తెరకెక్కించే విధంగా చూస్తున్నట్టు సమాచారం.
ఈ ఏడాది అల వైకుంఠపురంతో మంచి హిట్టు కొట్టిన బన్నీ, మరో హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. సుకుమార్ కూడా రంగస్థలం మంచి హిట్ తరువాత చాల గ్యాప్ తీసుకొని ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక ఈ చిత్రానికి భారీగా పారితోషకం తీసుకుందని సమాచారం. సెంకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలు చేజిక్కించుకుంటున్న జగపతిబాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ యాక్టర్ దీపక్ శెట్టి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.