జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత అల్లు అర్జున్, తివ్రిక్రమ్ కాంబినేషన్లో సినిమా లాంఛనంగా ఎప్పుడో ప్రారంభమైనా.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం నేటి నుండే షురూ అయ్యింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రధారి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ సినిమా కోసం బన్ని తన లుక్ను పూర్తిగా మార్చేశారు. సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే ప్రారంభమైంది.