Allu Arjun: బిగ్ స్క్రీన్పై స్టార్స్గా సత్తా చాటుతున్న కొందరు హీరోలు.. ఈ మధ్య టీవీ మరియు ఓటీటీ షోస్కి హోస్ట్గా మారి బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, చిరంజీవి, నాగార్జున, రానా వంటి వారు హోస్ట్గా సత్తా చాటగా.. ఈ మధ్య నటసింహ నందమూరి బాలకృష్ణ సైతం `అన్ స్టాపుబుల్ విత్ ఎన్బీకే` షోకు వ్యాఖ్యాతగా మారి అదరగొట్టేస్తున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో.. అన్ని టాక్ షోలను పాతాళానికి తొక్కి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
అన్ స్టాపుబుల్ షో సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం బాలయ్యే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే బాలయ్య మాదిరి హోస్ట్గా మారేందుకు కొందరు టాలీవుడ్ హీరోలు ఆరాటపడుతున్నారు. అయితే ఈ లిస్ట్లో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఆహా వారు మరో సరికొత్త టాక్ షోను ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఈ షోలో అల్లు అర్జున్ వ్యాఖ్యాతగా అవతారమెత్తేందుకు బాగా ఇంట్రస్ట్ చూపుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే.. నటుడిగా ఎంతో మందిని ఆకట్టుకున్న బన్నీ హోస్ట్గా సక్సెస్ అవుతాడా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే మరోవైపు బన్నీ హోస్టింగ్లో ఏదైనా తేడా వచ్చి షో పొరపాటును బెడిసి కొడతే అల్లు ఫ్యాన్స్ ఏడవటం ఖాయమన్న టాక్ కూడా ఉంది. కాబట్టి, బన్నీ అన్ని జాగ్రత్తలను తీసుకున్నాకే హోస్ట్గా బరిలోకి దిగాల్సి ఉంటుంది.
కాగా, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `పుష్ప` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడీయన. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా ఈ మూవీ దుమ్ము దులిపేసింది. ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.