ఒక్కొక్కసారి ఒకో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒకసారి ఐస్ బకెట్ ఛాలెంజ్.. ఒకసారి రైస్ బకెట్ ఛాలెంజ్.. మరోసారి.. మొక్కలు నాటే కార్యక్రమం.. ఇలాంటి ఛాలెంజెస్ల్లోకి సెలబ్రిటీలు వారి స్నేహితులను ఆహ్వానిస్తుంటారు. కొన్ని రోజుల ముందు బీభత్సంగా ట్రెండింగ్లో ఉన్న ఛాలెంజ్ల పర్వం కొన్నిరోజుల తర్వాత సద్దుమణిగింది. అయితే ఇప్పుడు ఓ కొత్త ఛాలెంజ్ మొదలైంది. ఆ ఛాలెంజే `రీడింగ్ ఈజ్ ఎ గుడ్ ఛాలెంజ్`. పుసక్త పఠనానికి సంబంధించిన ఛాలెంజ్.
రాంప్రసాద్ అనే నెటిజన్ ట్విట్టర్లో అమల అక్కినేని ఛాలెంజ్ను విసిరారు. `స్టోరీ ఎట్ వర్క్` అనే పుస్తకాన్ని చదువుతానని ఛాలెంజ్ను స్వీకరించిన అమల. తదుపరి ఈమె తన కోడలు సమంత అక్కినేని, ఫ్యామలీ ఫ్రెండ్ అయిన రామ్చరణ్ సతీమణి ఉపాసనకు ఛాలెంజ్ను విసిరారు. మరి ఈ ఇద్దరూ ఈ ఛాలెంజ్కు ఎలా స్పందిస్తారో చూడాలి.