భర్త విజయ్ నుండి విడిపోయిన అమలాపాల్ ఇప్పుడు గ్లామర్ పాత్రల కంటే వైవిధ్యమైన పాత్రలను చేయడానికే ఆసక్తిని చూపిస్తున్నారు. గత ఏడాది క్రైమ్ థ్రిల్లర్ `రాక్షసన్` సినిమాలో నటించి .. ఆ సినిమా విజయంలో తన వంతు తోడ్పాటును అందించారు. ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. అనూప్ ఫణికర్ దర్శకత్వంలో `కెడేవర్` చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అమలాపాల్ ఫోర్సెనిక్ పాథాలజిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ ప్రతికకు తెలియజేశారు. ఫోర్సెనిక్ పాథాలజిస్ట్గా నటించడం కోసం అమలాపాల్, ఆ రంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని కలుసుకుని విషయాలను తెలుసుకోవడమే కాదు.. కొన్ని కేస్ స్టడీస్లో స్వయంగా పాల్గొన్నానని తెలిపారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాతో అమలాపాల్ నిర్మాతగా మారారు. తను నిర్మాతగా మారడానికి కథే కారణమని అమల తెలిపారు. భవిష్యత్లో కొత్త కాన్సెప్ట్ చిత్రాలను, కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయడానికి నిర్మాతగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు అమలాపాల్.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!