తమిళ చరిత్రలో చోళులకు సంబంధించిన ప్రముఖ నవల `పొన్నియన్సెల్వన్`. కల్కి కృష్ణమూర్తి రాసిన ఈ నవలను సినిమా రూపంలో తెరకెక్కించాలని ఎం.జి.ఆర్ నుండి కమల్ హాసన్, భారతీరాజా ఇలా చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ ఎవరూ సినిమాను మెటీరియలైజ్ చేయలేకపోయారు. ఇప్పుడు మణిరత్నం ప్రయత్నం ప్రారంభించారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను మణిరత్నం ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాది స్టార్స్ అందరినీ ఈ చిత్రంలో నటింప చేస్తున్నారు మణిరత్నం. మోహన్ బాబు, కార్తి, విక్రమ్, శింబు, ఐశ్వర్యారాయ్, కీర్తిసురేష్, అనుష్క వంటి తారలు నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇందులో అమలాపాల్ను కూడా తీసుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఈమె ఎలాంటి పాత్ర చేయబోతుందో తెలియాలంటే వెయిటింగ్ తప్పదు.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!