ఎప్పుడూ ఏదో విధంగా హీరోయిన్ అమలాపాల్ వార్తల్లో నిలుస్తూ ఉంటది. 2011 వ సంవత్సరంలో బెజవాడ సినిమాతో తెలుగులో అమలాపాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2013వ సంవత్సరంలో చరణ్ నటించిన “నాయక్” చేయటం జరిగింది. ఆ తర్వాత బన్నీతో ఇద్దరమ్మాయిలతో ఇంకా నానితో జెండాపై కపిరాజు వంటి సినిమాలు చేసింది. ఈ క్రమంలో తాజాగా అమలాపాల్ తెలుగు సినిమా రంగంపై కాంట్రవర్సీ కామెంట్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ కొన్ని కుటుంబాల చేతిలో బంది అయింది అంటూ.. అమలాపాల్ వ్యాఖ్యానించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు ఈ విషయం తనకు అర్థమైందని చెప్పింది.
ప్రతి సినిమాలోనూ ఇద్దరి హీరోయిన్స్ ఉంటారని.. వారిని గ్లామర్ గా చూపిస్తూ.. లవ్ సీన్స్ ఇంకా పాటలకు మాత్రమే హీరోయిన్ పాత్రని పరిమితం చేస్తారని అమలాపాల్ టాలీవుడ్ ఇండస్ట్రీపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే తమిళ ఇండస్ట్రీ మెగా ప్రాజెక్టు మణిరత్నం దర్శకత్వంలో “పొన్నియన్ సెల్వన్ ” లో ఛాన్స్ మిస్సయిందని తెలిపింది. ఒక్కసారి కాదు రెండుసార్లు మణిరత్నం దర్శకత్వంలో అవకాశాలు చేతిదాక వచ్చి పోయాయని పేర్కొంది. మొదటి సినిమా ఆడిషన్స్ జరిగాయని కానీ సెట్స్ పైకి వెళ్లే టయానికి.. అవకాశం కోల్పోయినట్లు అమలాపాల్ తెలిపింది.
“పొన్నియన్ సెల్వన్ ” అత్యంత ప్రతిష్టాత్మకంగా మణిరత్నం చిత్రీకరించారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో విక్రమ్ తో పాటు హీరోయిన్ ఐశ్వర్యారాయ్, త్రిష.. కార్తీ మరికొంతమంది కీలక నటీనటులు నటించారు. సెప్టెంబర్ 30వ తేదీన “పొన్నియన్ సెల్వన్ 1” పార్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ధియేటర్లో రాకముందే అమెజాన్ ప్రైమ్ ఓటిటి సంస్థ 125 కోట్లకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడం జరిగింది అంట. డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా “పొన్నియన్ సెల్వన్” నీ రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!