హీరోయిన్ అమలపాల్, తమిళ డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ను 2014లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మూడేళ్లకే విడిపోయారు. అమలాపాల్ ఇప్పుడు మళ్లీ సినిమాలో ఫుల్ బిజీగా మారింది. డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన జయలలిత బయోపిక్ తలైవిని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ దర్శకుడు సాయిపల్లవిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపించాయి. డైరెక్టర్ విజయ్, సాయిపల్లవి ఈ వార్తలు ఖండించారు. కాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలకు విజయ్ చెక్ పెడుతూ.. తన పెళ్లిని అధికారికంగా ప్రకటించాడు. తాను డాక్టర్ ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటున్నానని ప్రకటించాడు. తమ పెళ్లిని పెద్దలు కుదిర్చారని, జూలైలో తమ పెళ్లి జరుగుతుందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!