హీరో, హీరోయిన్స్ కథ నచ్చి సినిమాలు చేయడం కామన్గా జరిగే విషయం. ఒకసారి సినిమా విడుదలైన తర్వాత వారికి, వారి రెమ్యునరేషన్కి సినిమా జయాపజయాలతో సంబంధం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో నటీనటులు నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా, కథ విపరీతంగా నచ్చితోనో రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తారు. రీసెంట్గా విడులైన `ఆమె` సినిమా విషయంలో అదే జరిగింది. అయితే సినిమా విడుదల అనుకున్న సమయానికి కాకుండా ఓరోజు ఆలస్యంగా విడుదలైంది. `తమిళ నిర్మాతలు, ఫైనాన్సియర్స్ మధ్య గొడవ రావడంతో తెలుగు, తమిళంలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. దాంతో అమలాపాల్ ముందుకొచ్చారు. తన రెమ్యునరేషన్ని వెనక్కి ఇవ్వడమే కాదు.. అదనంగా కూడా డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేసింది. తమిళ నిర్మాతలు ఈ విషయంలో మమ్మల్ని మోసం చేశారు. మేం వారికి డబ్బులు చెల్లించేసినా, వారు సినిమాను ఇవ్వలేకపోయారు. వారిపై ఇప్పటికే నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాం. కేసు కూడా పెట్టబోతున్నాం“ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ఈయన `ఆమె` చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు.
previous post
next post